నిర్మాత సురేష్ వేధిస్తున్నాడని కన్నడ హీరోయిన్ అవంతిక పిటిషన్
- June 06, 2017
ఇండస్ట్రీలో మహిళా నటులకు అడుగడుగునా వేధింపులే అని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా తనకు అన్యాయం జరిగింది అని... తన ప్రతిష్టకు భంగం కలిగేలా సినీ నిర్మాత వ్యవహరిస్తున్నాడని.. అందుకు తన సినీ కెరీర్ కే కాదు తన ప్రతిష్ట కు భంగం కలిగేలా ఉందని ట్విట్టర్ వేదికగా హీరోయిన్ అవంతిక గొంతు విప్పింది. వివరాల్లోకి వెళ్తే...
గ్లామర్ ఇండస్ట్రీ లో తనకు అన్యాయం జరిగిందని బుల్లి తెర నుంచి వెండి తెరపై కి వచ్చి హీరోయిన్ గా రాణిస్తున్న అవంతిక సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నది. తనను "రాజు కన్నడ మీడియం" చిత్ర ప్రొడ్యూసర్ సురేష్ పై సంచలన ఆరోపణలు చేసింది.. తనకు రాజు కన్నడ మీడియం సినిమా తొలి షెడ్యూల్ నుంచే కష్టాలు ప్రారంభం అయ్యాయని... మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డానని.. అయినా సరే షూటింగ్ సమయంలో బ్యాంకాక్ లో చాలా దారుణంగా ప్రవర్తించారని.. తెలిపింది.. అంతేకాదు తనకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని.. ఈ విషయంపై నిర్మాతను నిలదీసి అడగగా.. తనను వెంటనే ముంబై పంపించి... ఇప్పటి వరకూ తనకు ఇవ్వాలసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని పేర్కొన్నది.. తనతో డబ్బింగ్ చెప్పించకుండా.. సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారని.. దీంతో ఈ మోసంపై కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపింది.. ఈ ఆరోపణలతో.. ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన గురించి అవాస్తవాలను పత్రికలో నిర్మాత రాయించినట్లు ఆరోపించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









