బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయిల ముఖాలు

- June 06, 2017 , by Maagulf
బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయిల ముఖాలు

బ్రిటిష్ పార్లమెంటులో భారతీయిల హవా పెరుగుతోంది. ఈ ఏడాది జరిగే స్నాప్ పోల్స్‌లో మొత్తం 56 మంది బరిలో ఉన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన18 ఏళ్ళ విద్యార్థి అరన్ రంగి సైతం పోటీకి సై అంటున్నాడు. 2015 లో 10 మంది భారతీయులు బ్రిటన్ చట్టసభకు ఎన్నిక కావడం విశేషం.
ప్రీతి పటేల్, అలోక్ శర్మ, వీరేంద్ర శర్మ కీత్ వజ్ వంటి వారంతా మళ్ళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో కీత్ గత ఏడాది వ్యభిచారం, డ్రగ్స్ స్కాం ఆరోపణలకు గురయ్యాడు. అయినా పోటీకి దిగాడు. లేబర్ పార్టీ అభ్యర్థిగా తన్మన్ జీత్ సింగ్ మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నాడు.కోల్ కతాకు చెందిన రోహిత్ దాస్ గుప్తా తన గెలుపు సునాయాసమంటున్నాడు.గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అరన్ రంగి మాత్రం తన విజయం మీద సందేహం వ్యక్తం చేస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com