ఇరాన్‌ పార్లమెంట్‌లో ముష్కరులు దాడి

- June 07, 2017 , by Maagulf
ఇరాన్‌ పార్లమెంట్‌లో ముష్కరులు దాడి

అత్యంత భద్రత మధ్య ఉండే ఇరాన్‌ పార్లమెంట్‌పై నేడు ముష్కరులు దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ముగ్గురు ముష్కరులు ఆయుధాలతో పార్లమెంట్‌లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక గార్డు సహా 8మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పార్లమెంట్‌లో కాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరులు కొంత మందిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com