ఆహార పదార్థాల కొరతలేదు: ఖతార్ మినిస్ట్రీ
- June 07, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) ఉన్నతాధికారి, దేశంలో ఆహార పదార్థాల కొరత లేదని స్పష్టం చేశారు. ఎంఇసి అండర్ సెక్రెటరీ షేక్ జస్సిమ్ బిన్ జబెర్ అల్ థని మాట్లాడుతూ, ఖతార్ సర్ప్లస్ ఫుడ్ సప్లయ్ కలిగి ఉందనీ, అన్ని రకాల ఆహార పదార్థాలూ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉన్నాయని తెలిపారు. అలాగే ఫుడ్ షార్టేజీ తలెత్తకుండా ఎమర్జన్సీ ప్లాన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. నివాసితులు అలాగే, పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పొరుగు దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఉండవచ్చునన్న ప్రచారంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతార్ అధికారిక వర్గాలు పౌరులను అప్రమత్తం చేసి, వాస్తవ పరిస్థితుల్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









