ఆహార పదార్థాల కొరతలేదు: ఖతార్ మినిస్ట్రీ
- June 07, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) ఉన్నతాధికారి, దేశంలో ఆహార పదార్థాల కొరత లేదని స్పష్టం చేశారు. ఎంఇసి అండర్ సెక్రెటరీ షేక్ జస్సిమ్ బిన్ జబెర్ అల్ థని మాట్లాడుతూ, ఖతార్ సర్ప్లస్ ఫుడ్ సప్లయ్ కలిగి ఉందనీ, అన్ని రకాల ఆహార పదార్థాలూ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉన్నాయని తెలిపారు. అలాగే ఫుడ్ షార్టేజీ తలెత్తకుండా ఎమర్జన్సీ ప్లాన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. నివాసితులు అలాగే, పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పొరుగు దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఉండవచ్చునన్న ప్రచారంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతార్ అధికారిక వర్గాలు పౌరులను అప్రమత్తం చేసి, వాస్తవ పరిస్థితుల్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







