హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం 40 మంది మృతి
- June 08, 2017
హరారే: హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
మరో 24 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ చెట్టును ఢీకొట్టిందని, దీంతో ప్రయాణీకులు మృతి చెందారని పోలీసు అధికారి చారిటీ చరంబ తెలిపారు.
ఆ సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు. ఇటీవలే కొద్ది నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయారని, మళ్లీ మరో సంఘటన విషాదకరమని ఆ అధికారి అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!









