నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి అరెస్టు
- June 08, 2017
నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్పేటే పోలీస్స్టేషన్ పరిధిలో ఓ షాపు వద్దకు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయడానికి ప్రయత్నించగా, అనుమానం వచ్చిన షాపు యజమాని ఆమెను ప్రశ్నించగా ఆమె అక్కడి నుంచి పారిపోవాలని చూసింది. దీంతో ఆయనతో పాటు స్థానికులు ఆమెను వెంబడించి పట్టుకున్నాడు. ఆమె వద్ద భారీగా నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఆమెపై వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ నటితో పాటు ఆమెకు సహకరిస్తున్న ఆటోడ్రైవరు గోవిందరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారు మాత్రమే కాదు నిర్మాతలు, కొందరు నటులు కూడా నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జయమ్మ సెల్ఫోన్ ఆధారంగా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









