శ్రీలంక చేతులలో ఓటమి రుచిచూసిన భారత్
- June 08, 2017
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక 48.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో శ్రీలంక సెమీస్ ఆశలు నిలుపుకొంది. భారత బౌలర్ల పేలవ ప్రదర్శనను సద్వినియోగం చేసుకున్న శ్రీలంక బ్యాట్స్మెన్లు గుణతిలక (76: 72 బంతుల్లో 7×4, 2×6), కుశాల్ మెండిస్ (89: 93 బంతుల్లో 11×4, 1×6), ఎంజిలో మాథ్యూస్(52: 45 బంతుల్లో 6×4 ) అర్ధశతకాలతో మెరిశారు. కుశాల్ పెరీరా(47: 44 బంతుల్లో 5×4) గాయంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్హార్ట్గా వినుదిరగగా, గుణరత్నే(34: 21 బంతుల్లో 2×4, 2×6) తోడుగా మ్యాథ్యూస్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. శ్రీలంక బ్యాట్స్మెన్లలో ఇద్దరు రనౌట్ కాగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కుశాల్ మెండిస్ ఎంపికయ్యాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
శిఖర్ ధావన్ (125: 128 బంతుల్లో 15×4, 1×6) అద్భుతంగా ఆడి శతకం సాధించగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ(78: 79 బంతుల్లో 6×4, 3×6), ధోనీ (63: 52 బంతుల్లో 7×4, 2×6), అర్ధశతకాలతో రాణించారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









