శ్రీలంక చేతులలో ఓటమి రుచిచూసిన భారత్
- June 08, 2017
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక 48.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో శ్రీలంక సెమీస్ ఆశలు నిలుపుకొంది. భారత బౌలర్ల పేలవ ప్రదర్శనను సద్వినియోగం చేసుకున్న శ్రీలంక బ్యాట్స్మెన్లు గుణతిలక (76: 72 బంతుల్లో 7×4, 2×6), కుశాల్ మెండిస్ (89: 93 బంతుల్లో 11×4, 1×6), ఎంజిలో మాథ్యూస్(52: 45 బంతుల్లో 6×4 ) అర్ధశతకాలతో మెరిశారు. కుశాల్ పెరీరా(47: 44 బంతుల్లో 5×4) గాయంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్హార్ట్గా వినుదిరగగా, గుణరత్నే(34: 21 బంతుల్లో 2×4, 2×6) తోడుగా మ్యాథ్యూస్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. శ్రీలంక బ్యాట్స్మెన్లలో ఇద్దరు రనౌట్ కాగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కుశాల్ మెండిస్ ఎంపికయ్యాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
శిఖర్ ధావన్ (125: 128 బంతుల్లో 15×4, 1×6) అద్భుతంగా ఆడి శతకం సాధించగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ(78: 79 బంతుల్లో 6×4, 3×6), ధోనీ (63: 52 బంతుల్లో 7×4, 2×6), అర్ధశతకాలతో రాణించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









