బ్రిటన్ ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళ ప్రీత్ కౌర్
- June 09, 2017
బ్రిటన్ ఎన్నికల్లో ఓ సిక్కు మహిళ చరిత్రాత్మక విజయం సాధించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాగా, బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమే ప్రస్తుత సండ్వెల్లి కౌన్సిలర్ ప్రీత్ కౌర్ గ్రిల్.
ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ప్రీత్కౌర్ గ్రిల్ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ నుంచి పోటీ చేసి 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి కరోలిన్ స్క్వైర్పై గ్రిల్ 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఎడ్జ్బాస్టన్కు ఎంపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఎడ్జ్బాస్టన్ ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. బ్రిటన్ పార్లమెంటులో తొలిసారి అడుపెడుతండటం తనకు ఆనందంగా ఉందని ప్రీత్ కౌర్ చెప్పారు.
కాగా, అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్జీత్ సింగ్ దేశి కూడా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. స్లోగ్ సీటు నుంచి తన్మన్జీత్ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్ పార్లమెంట్కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారి. కాగా, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో 56మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు పోటీ చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









