రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ నిరోషా
- June 10, 2017
ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన హీరోయిన్స్ మళ్లీ రీ ఎంట్రీతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే నదియా, రాశి, ఖుష్బు లాంటి నాటి తరం భామలు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు అదే దారిలో రాధికా సోదరి నిరోషా కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, మణిరత్నం ఘర్షణ సినిమాలతో పాటుగా బాలయ్య నారి నారి నడుమ మురారి సినిమాలలో నటించిన నిరోషా అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
ఇక తన సహనటుడి రాంకిని పెళ్లాడిన ఈ అమ్మడు మళ్లీ సినిమాల మీద మనసు పడ్డది. ప్రస్తుతం తెలుగులో సుధార్ హీరోగా నటిస్తున్న నువ్వు తోపురా సినిమాలో నటిస్తుంది నిరోషా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన సుధాకర్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో పడేశావే హీరోయిన్ నిత్యా శెట్టి ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.
హరినాథ్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యునైటెడ్ ఫిలింస్ బ్యానర్లో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. రీ ఎంట్రీలో అదరగొడుతున్న అలాంటి భామల లానే నిరోషా కూడా నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. రొమాంటిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు.
తెలుగులో సక్సెస్ అయితే మళ్లీ ఇక వరుస సినిమాలను చేసే ఆలోచనలో ఉంది నిరోషా. 2005లో తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో సినిమాలో అత్త పాత్రలో నటించి మెప్పించింది నిరోషా. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత తెలుగులో నువ్వు తోపురా సినిమాతో వస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









