టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థల అక్కౌంట్ల మూసివేత

- June 10, 2017 , by Maagulf

బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లకు యూఏఈ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ జరిగేందుకు వీలు లేదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌ సర్క్యులర్‌ని జారీ చేసింది. మరో సర్క్యులర్‌లో, 59 వ్యక్తిగత, 12 సంస్థాగత ఖాతాలను నిలుపుదల చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖతార్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌, ఖతార్‌ ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌, బార్వా బ్యాంక్‌, మస్‌రాఫ్‌ అల్‌ రయాన్‌, ఖతార్‌ నేషనల్‌ బ్యాంక్‌, దోహా బ్యాంక్‌ వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి, ఆయా బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com