టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థల అక్కౌంట్ల మూసివేత
- June 10, 2017బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు యూఏఈ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ జరిగేందుకు వీలు లేదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్ని జారీ చేసింది. మరో సర్క్యులర్లో, 59 వ్యక్తిగత, 12 సంస్థాగత ఖాతాలను నిలుపుదల చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్, ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, బార్వా బ్యాంక్, మస్రాఫ్ అల్ రయాన్, ఖతార్ నేషనల్ బ్యాంక్, దోహా బ్యాంక్ వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి, ఆయా బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







