ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియా అంటున్న ఐసిస్
- June 10, 2017
రియాద్: ఇరాన్ పార్లమెంట్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్) ఇప్పుడు మరో దేశం మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ ఓ వీడియో విడుదల చేశారని అధికారులు గుర్తించారు.
ఇరాన్ దాడికి ముందే ఆ వీడియో రికార్డు చేశారని సైట్ (ఎస్ఐటీఇ) అధికారులు అంటున్నారు. ఇరాన్, సౌదీ అరేబియాలో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది హెచ్చరించాడు. మేమే సౌదీ అరేబియాలో అడుగు పెట్టం అన్నాడు.
అయితే మీదేశంలోనే ఉన్న మా సహచరులు దాడులు చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశాడు. ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియానే, మమల్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ ఉగ్రవాది చాలెంజ్ చేశాడు. అంతే కాకుండా ఇరాన్ లో షియా వర్గీయులపై మరన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు.
మేము ఎవ్వరి ఏజెంట్లు కాదు, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. మేము ఇస్లాం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, గల్ఫ్ దేశాలను సైతం వదిలిపెట్టం అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హెచ్చరించాడు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ స్పష్టంగా హెచ్చరికలు చెయ్యడంతో ఆ దేశంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









