మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- April 20, 2026
మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యి ఇళ్లు దగ్ధం
కౌలాలంపూర్: మలేషియాలోని సబా రాష్ట్రంలో ఊహించని రీతిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సందకన్ జిల్లాలోని కాంపంగ్ బహగియా ప్రాంతంలో మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో సుమారు వెయ్యి ఇళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
సముద్రం పై కర్రలతో నిర్మించిన ఇళ్లు కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 9 వేల మంది ప్రజలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బాధితులందరూ ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









