మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- April 20, 2026
మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యి ఇళ్లు దగ్ధం
కౌలాలంపూర్: మలేషియాలోని సబా రాష్ట్రంలో ఊహించని రీతిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సందకన్ జిల్లాలోని కాంపంగ్ బహగియా ప్రాంతంలో మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో సుమారు వెయ్యి ఇళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
సముద్రం పై కర్రలతో నిర్మించిన ఇళ్లు కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 9 వేల మంది ప్రజలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బాధితులందరూ ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







