అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- April 20, 2026
అమెరికా: అమెరికాలోని లూసియానా రాష్ట్రం ష్రీవ్పోర్ట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక దుండగుడు తన సొంత పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది చిన్నారులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోర ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిందితుడు వెస్ట్ 79వ స్ట్రీట్లోని రెండు ఇళ్లపై, అలాగే హారిస్ స్ట్రీట్లోని మరో నివాసంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన చిన్నారులంతా ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన అనంతరం నిందితుడు ఒక కారును దొంగిలించి (Mass shooting USA ) అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని వెంబడించి బోసియర్ సిటీ సమీపంలో ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అమెరికాలో గన్ నియంత్రణ చట్టాలపై మళ్లీ చర్చ మొదలైంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









