అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- April 20, 2026
అమెరికా: అమెరికాలోని లూసియానా రాష్ట్రం ష్రీవ్పోర్ట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక దుండగుడు తన సొంత పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది చిన్నారులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోర ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిందితుడు వెస్ట్ 79వ స్ట్రీట్లోని రెండు ఇళ్లపై, అలాగే హారిస్ స్ట్రీట్లోని మరో నివాసంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన చిన్నారులంతా ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన అనంతరం నిందితుడు ఒక కారును దొంగిలించి (Mass shooting USA ) అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని వెంబడించి బోసియర్ సిటీ సమీపంలో ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అమెరికాలో గన్ నియంత్రణ చట్టాలపై మళ్లీ చర్చ మొదలైంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









