అమాయకంగా నటించి దొంగతనానికి పాల్పడ్డ వైనం
- June 13, 2017
అజ్మన్ పోలీసులు ఆసియాకి చెందిన ఓ వ్యక్తి నుంచి 24,000 దిర్హామ్లు దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనంలో సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజ్మన్ పోలీస్, పోలీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా సైఫ్ అల్ మత్రోషి మాట్లాడుతూ, దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు అందగానే స్పందించినట్లు చెప్పారు. బాధితుడు బ్యాంకు నుంచి డబ్బుని డ్రా చేసి బయటకు వస్తుండగా, ఓ వ్యక్తి యూఏఈ కరెన్సీ ఎలా ఉంటుందో చూపించమని అడగ్గా, బాధితుడు తాను డ్రా చేసిన 70,000 మొత్తాన్ని చూపించాడనీ, కాస్సేపటి తర్వాత డబ్బులు లెక్కిస్తే అందులోంచి 24,000 దిర్హామ్లు తగ్గినట్టుగా గుర్తించి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. ఇరవై నాలుగ్గంటల్లోనే నిందుతులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, అపరిచిత వ్యక్తులు దృష్టి మరల్చి డబ్బు కాజేస్తారు గనుక, ఎవర్నీ విశ్వసించరాదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







