గల్ఫ్ దేశాలు కతర్ ను నిషేధించడంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండన
- June 14, 2017
కతర్:గల్ఫ్ దేశాలు కతర్ కు పలు విషయాలలో సహకారం అందించే విషయంలో ఏకాకిని చేసి నిషేధించడంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. కతర్ పై దిగ్బంధం కారణంగా కుటుంబాల మీద ప్రభావం చూపుతున్న అల్లర్లకు సంబంధించి సౌదీ అరేబియా, యుఎఇ మరియు బహ్రెయిన్లతో కూడిన గల్ఫ్ దేశాలు తీసుకున్న చర్యలు అస్పష్టంగా ఉన్నాయని, మానవ హక్కులను హరించడం సరికాదంటూ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, డాక్టర్ అలీ బిన్ స్మాక్ అల్-మర్రి చర్చలు నిర్వహించారు.లండన్ లో జరిగిన ఈ సమావేశంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్, సలీల్ శెట్టి మాట్లాడుతూ, గల్ఫ్ దేశాలు కతర్ పై విధించిన దిగ్బంధ ఫలితాల ప్రభావం పలు సమస్యలు కతర్ ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ ఉల్లంఘనలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించినప్పటికీ, తిరిగి యధాస్థితి కొనసాగింపుపై అన్ని సంబంధిత పార్టీలతోనూ, అంతర్జాతీయ సంస్థలతోనూ చర్చించి కతర్ పై నిషేధం ఎత్తివేయాలని కోరనున్నట్లు ఆయన చెప్పారు. మూడు గల్ఫ్ దేశాలు చేపట్టిన చర్యలు, ముట్టడి ,ప్రతిఘటన మరియు సాధారణ కుటుంబాలపై నిషేధ ప్రభావము కారణంగా ఇబ్బదులు పడుతున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







