కార్మికులకు బకాయిల్ని విడుదల చేసిన కంపెనీ
- June 14, 2017
మనామా: లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ జోక్యంతో, కార్మికులకు కొన్నాళ్ళుగా వేతనాలు బకాయిపడ్డ సంస్థ, ఆ బకాయిల్ని చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ వివాదానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. దాంతో మినిస్ట్రీ, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే సంస్థ, బకాయిల్ని చెల్లించడానికి తగిన నిధుల్ని విడుదల చేసింది. దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్న కార్మికులకు సైతం రావాల్సిన పూర్తి వేతనాల్ని సంస్థ చెల్లించనుంది. వారికి మినిస్ట్రీ ఆఫ్ వర్కర్స్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద తగిన సౌకర్యాల్ని కలగజేస్తోంది. వారం రోజుల్లోగా కంపెనీ, ఈ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







