కార్మికులకు బకాయిల్ని విడుదల చేసిన కంపెనీ

- June 14, 2017 , by Maagulf
కార్మికులకు బకాయిల్ని విడుదల చేసిన కంపెనీ

మనామా: లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ జోక్యంతో, కార్మికులకు కొన్నాళ్ళుగా వేతనాలు బకాయిపడ్డ సంస్థ, ఆ బకాయిల్ని చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ వివాదానికి సంబంధించి ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీకి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. దాంతో మినిస్ట్రీ, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే సంస్థ, బకాయిల్ని చెల్లించడానికి తగిన నిధుల్ని విడుదల చేసింది. దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్న కార్మికులకు సైతం రావాల్సిన పూర్తి వేతనాల్ని సంస్థ చెల్లించనుంది. వారికి మినిస్ట్రీ ఆఫ్‌ వర్కర్స్‌ బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద తగిన సౌకర్యాల్ని కలగజేస్తోంది. వారం రోజుల్లోగా కంపెనీ, ఈ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com