ఛాంపియన్ ట్రోఫీ లో చిత్తైన ఇంగ్లడ్.. ఫైనల్లో పాక్
- June 14, 2017
ఇంగ్లండ్పై ఘన విజయం
పాక్ ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన
వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇంగ్లండ్ను చూసి ప్రతి ఒక్కరూ ఫైనల్కు ఆ జట్టే వెళ్తూందని భావించారు. ఇక మాజీ క్రికెటర్లు బెట్ కూడా వేసుకున్నారు.. చివరికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నోటా కూడా ఇదే మాట.. కానీ అందరి అంచనాలు పటా పంచెలు చేస్తూ పాక్ ఫైనల్ రేసుకు దూసుకెళ్లి దాయదీ జట్లకు సవాలు విసిరింది.
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్తో జరిగిన తొలి సెమీస్లో పాక్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో ఓటమెరుగని జట్టును ఓడించి ఇంటికి సాగనంపింది. ఆడినా మూడు మ్యాచుల్లో 300 పై చిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్ను పాక్ 211 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకోగా.. బ్యాట్స్మెన్స్ తమ బాధ్యతను నిర్వర్తించి విజయాన్నందించారు. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, ఓపెనర్లు అజార్, ఫకార్లు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో రెండో వికెట్కు 118 పరుగులు జమయ్యాయి.
తొలుత 49 బంతుల్లో ఫకార్ అర్ద సెంచరీ చేయగా, అజార్ 68 బంతుల్లో సాధించాడు. వీరి శతక భాగస్వామ్యానికి ఇంగ్లండ్ నిర్ధేశించిన లక్ష్యం చిన్నబోయింది. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫకార్ వెనుదిరగగా క్రీజులోకి వచ్చిన బాబర్, అజార్ తో కలిసి ఆచితూచి ఆడాడు. అజార్ అలీ(70; 100 బంతులు,5 ఫోర్లు,1 సిక్స్) అవుటవ్వడంతో మూడో వికెట్కు 55 పరుగులు జమయ్యాయి. దీంతో పాక్ విజయం సులువైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన హఫీజ్ సాయంతో బాబర్ మిగతా పనిని పూర్తిచేశాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు చేసిన ఇంగ్లండ్ పాక్ బౌలర్ల దాటికి 211 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లో బెయిర్ స్టో(43), జోరూట్ (46), బెన్ స్టోక్స్(34), మోర్గాన్(33)లు విఫలమవ్వడంతో ఇంగ్లండ్ పాక్కు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ (3), రుమాన్ రయీస్ (2), జునైద్ ఖాన్ (2), షదాబ్ ఖాన్(1) వికెట్లు పడగొట్టారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









