గుంటూరు లో అవినీతి నిర్మూలనకు 1100 టోల్ఫ్రీ నెంబరు
- June 14, 2017
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిని నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో బుధవారం మైనింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరప్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైనింగ్ కాంట్రాకర్లు నిజాయితీగా వ్యవహరించి, గొల్లపాలెం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అవినీతి నిర్మూలన, లంచాలపై సమాచారానికి ఏర్పాటుచేసిన 1100 టోల్ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతోనే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెంబరుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తు చేయడానికి 750 మందితో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతుందన్నారు. సమావేశంలో కలెక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







