గుంటూరు లో అవినీతి నిర్మూలనకు 1100 టోల్ఫ్రీ నెంబరు
- June 14, 2017
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిని నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో బుధవారం మైనింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరప్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైనింగ్ కాంట్రాకర్లు నిజాయితీగా వ్యవహరించి, గొల్లపాలెం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అవినీతి నిర్మూలన, లంచాలపై సమాచారానికి ఏర్పాటుచేసిన 1100 టోల్ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతోనే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెంబరుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తు చేయడానికి 750 మందితో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతుందన్నారు. సమావేశంలో కలెక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









