గుంటూరు లో అవినీతి నిర్మూలనకు 1100 టోల్ఫ్రీ నెంబరు
- June 14, 2017
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిని నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో బుధవారం మైనింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరప్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైనింగ్ కాంట్రాకర్లు నిజాయితీగా వ్యవహరించి, గొల్లపాలెం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అవినీతి నిర్మూలన, లంచాలపై సమాచారానికి ఏర్పాటుచేసిన 1100 టోల్ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతోనే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెంబరుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తు చేయడానికి 750 మందితో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతుందన్నారు. సమావేశంలో కలెక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









