నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కనున్నహీరో మహేష్ బాబు
- June 15, 2017
ప్రిన్స్ మహేష్ బాబు.. సూపర్ హిట్ మూవీ శ్రీమంతుడు.. సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. మహేష్ కు మంచి పేరుని కూడా తెచ్చింది.. కాగా తన నవలను కాపీ కొట్టి.. శ్రీమంతుడు సినిమా తెరకెక్కించారాని.. తనకు జరిగిన అన్యాయానికి తుది వరకూ పోరాడతానని.. నవలా రచయిత శరత్ చంద్ర కోర్టు మెట్లు ఎక్కిన సంగతి విధితమే... చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి వారు కోర్టు బయటే రాజీ యత్నాలు చేశారు.. కానే వారు ఇవ్వజూపిన మొత్తం తక్కువ కావడంతో.. రచయిత రాజీకి రెడీ లేడు.. దీంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా శ్రీమంతుడు చిత్ర హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ ను కోర్టుకు హజారు కావాల్సిందేనని.. నాంపల్లి కోర్టు ఆదేశాలను జారీ చేసింది.. కాగా ఇదే విషయంపై మహేష్ తరపు న్యాయవాది చెప్పిన.. సంగతి ఏమిటంటే.. హీరోకి కధ కాపీ విషయంలో అంతగా సంబంధం ఉండదు.. ఎందుకంటే హీరో.. తన వద్దకు వచ్చిన కధ కాపీనా.. లేక ఒరిజినల్ అనా చూసుకొనే వ్యవహారంతో హీరోకి ఎటువంటి సమంధం ఉండదు.. కాపీ కధ వివాదం.. కధా రచయిత, నిర్మాత, దర్శకులే బాధ్యత.. అని చెప్పారు.. కాగా చట్టం ప్రకారం.. హీరోని కూడా కోర్టు ప్రశ్నిస్తుందని తెలిపాడు.. కాగా మహేష్ సినిమాల్లో కోర్టు మెట్లు ఎక్కితే ఒకే.. కానీ నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం అభిమానులకు నచ్చని సంగతి.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









