నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కనున్నహీరో మహేష్ బాబు
- June 15, 2017
ప్రిన్స్ మహేష్ బాబు.. సూపర్ హిట్ మూవీ శ్రీమంతుడు.. సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. మహేష్ కు మంచి పేరుని కూడా తెచ్చింది.. కాగా తన నవలను కాపీ కొట్టి.. శ్రీమంతుడు సినిమా తెరకెక్కించారాని.. తనకు జరిగిన అన్యాయానికి తుది వరకూ పోరాడతానని.. నవలా రచయిత శరత్ చంద్ర కోర్టు మెట్లు ఎక్కిన సంగతి విధితమే... చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి వారు కోర్టు బయటే రాజీ యత్నాలు చేశారు.. కానే వారు ఇవ్వజూపిన మొత్తం తక్కువ కావడంతో.. రచయిత రాజీకి రెడీ లేడు.. దీంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా శ్రీమంతుడు చిత్ర హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ ను కోర్టుకు హజారు కావాల్సిందేనని.. నాంపల్లి కోర్టు ఆదేశాలను జారీ చేసింది.. కాగా ఇదే విషయంపై మహేష్ తరపు న్యాయవాది చెప్పిన.. సంగతి ఏమిటంటే.. హీరోకి కధ కాపీ విషయంలో అంతగా సంబంధం ఉండదు.. ఎందుకంటే హీరో.. తన వద్దకు వచ్చిన కధ కాపీనా.. లేక ఒరిజినల్ అనా చూసుకొనే వ్యవహారంతో హీరోకి ఎటువంటి సమంధం ఉండదు.. కాపీ కధ వివాదం.. కధా రచయిత, నిర్మాత, దర్శకులే బాధ్యత.. అని చెప్పారు.. కాగా చట్టం ప్రకారం.. హీరోని కూడా కోర్టు ప్రశ్నిస్తుందని తెలిపాడు.. కాగా మహేష్ సినిమాల్లో కోర్టు మెట్లు ఎక్కితే ఒకే.. కానీ నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం అభిమానులకు నచ్చని సంగతి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







