వ్యక్తి ప్రాణం తీసిన కింగ్ ఖాన్ షారుఖ్
- June 16, 2017
కింగ్ ఖాన్ షారుఖ్ ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ కోర్ట్ లో పిర్యాదు చేసాడు.అసలు విషయం ఏంటి అంటే..'రయీస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా జనవరి 23న వడోదరకు క్రాంతి ఎక్స్ప్రెస్లో షారుఖ్ వచ్చాడు. షారుఖ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
అభిమానులను చుసిన ఆనందం లో షారుక్ సరదాగా జనాలపై టీషర్టులు, బాల్స్ విసిరేశారు. అవి తీసుకోవాలన్న ఆతృతతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా , మరో ఇద్దరు పోలీసులు స్పృహకోల్పోయారు. అప్పటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న డీఎస్పీ తరుణ్ బరోత్ ఈ దుర్ఘటనకు కారణం షారుకేనని అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోర్ట్ లో పిర్యాదు చేసాడు..షారుక్ అలా టీషర్టులు విసరకపోయి ఉంటే ఆ వ్యక్తి చనిపోయే వాడుకాదని దీనంతటికీ కారణం షారుకే కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలని తరుణ్ డిమాండ్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







