వ్యక్తి ప్రాణం తీసిన కింగ్ ఖాన్ షారుఖ్

- June 16, 2017 , by Maagulf
వ్యక్తి ప్రాణం తీసిన కింగ్ ఖాన్ షారుఖ్

కింగ్ ఖాన్ షారుఖ్ ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రైల్వే డీఎస్పీ తరుణ్‌ బరోత్‌ కోర్ట్ లో పిర్యాదు చేసాడు.అసలు విషయం ఏంటి అంటే..'రయీస్‌' చిత్ర ప్రమోషన్ లో భాగంగా జనవరి 23న వడోదరకు క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో షారుఖ్ వచ్చాడు. షారుఖ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
అభిమానులను చుసిన ఆనందం లో షారుక్‌ సరదాగా జనాలపై టీషర్టులు, బాల్స్‌ విసిరేశారు. అవి తీసుకోవాలన్న ఆతృతతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా , మరో ఇద్దరు పోలీసులు స్పృహకోల్పోయారు. అప్పటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న డీఎస్పీ తరుణ్‌ బరోత్‌ ఈ దుర్ఘటనకు కారణం షారుకేనని అతన్ని అరెస్ట్‌ చేయాల్సిందిగా కోర్ట్ లో పిర్యాదు చేసాడు..షారుక్‌ అలా టీషర్టులు విసరకపోయి ఉంటే ఆ వ్యక్తి చనిపోయే వాడుకాదని దీనంతటికీ కారణం షారుకే కాబట్టి అతన్ని అరెస్ట్‌ చేయాలని తరుణ్ డిమాండ్ చేస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com