వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు

- October 12, 2015 , by Maagulf
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. నల్లపాడు రోడ్డులోని దీక్షా స్థలి నుంచి బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులోని ఐసీయూలోకి తరలించి వెంటవెంటనే పరీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ప్రస్తుతం ఆయనతోపాటే ఐసీయూలో ఉండి పరామర్శిస్తున్నారు. ఏడో రోజుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com