వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు
- October 12, 2015
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. నల్లపాడు రోడ్డులోని దీక్షా స్థలి నుంచి బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులోని ఐసీయూలోకి తరలించి వెంటవెంటనే పరీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ప్రస్తుతం ఆయనతోపాటే ఐసీయూలో ఉండి పరామర్శిస్తున్నారు. ఏడో రోజుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







