టీమిండియా గెలుపు కోసం భారత దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు

- June 18, 2017 , by Maagulf
టీమిండియా గెలుపు కోసం భారత దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు

క్రికెట్ లవర్స్ ఊగిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. అందుకే.. ఆ రెండు దేశాల్లోనే కాదు.. క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరూ ఫైనల్ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మన దేశంలో టీమిండియా విజయాన్ని ఆకాంక్షిస్తూ.. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ముస్లింలు.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బోర్డర్లో పాకిస్తాన్ పై తుపాకులు ఎక్కుపెట్టి డ్యూటీ చేసే జవాన్లు... క్రికెట్ గ్రౌండ్ లో జరిగే మహా సంగ్రామంలో కోహ్లీ గ్యాంగ్ వీరవిహారం చేయాలంటూ ఆటపాటలతో కోరుతున్నారు.
లీగ్ దశలో పాక్‌కు చుక్కలు చూపింది.. టీమిండియా. దాన్ని రిపీట్ చేస్తుందని దేశవ్యాప్తంగా అందరిలోను నమ్మకం. పదేళ్ల క్రితం జరిగిన టీ-ట్వంటీ ఫైనల్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు.. బ్యాట్స్ మెన్, అటు బౌలర్లు, అంతా ఫాంలో ఉండడం కలిసొచ్చే అంశం. భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ పండితులూ చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com