టీమిండియా గెలుపు కోసం భారత దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు
- June 18, 2017
క్రికెట్ లవర్స్ ఊగిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. అందుకే.. ఆ రెండు దేశాల్లోనే కాదు.. క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరూ ఫైనల్ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మన దేశంలో టీమిండియా విజయాన్ని ఆకాంక్షిస్తూ.. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ముస్లింలు.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బోర్డర్లో పాకిస్తాన్ పై తుపాకులు ఎక్కుపెట్టి డ్యూటీ చేసే జవాన్లు... క్రికెట్ గ్రౌండ్ లో జరిగే మహా సంగ్రామంలో కోహ్లీ గ్యాంగ్ వీరవిహారం చేయాలంటూ ఆటపాటలతో కోరుతున్నారు.
లీగ్ దశలో పాక్కు చుక్కలు చూపింది.. టీమిండియా. దాన్ని రిపీట్ చేస్తుందని దేశవ్యాప్తంగా అందరిలోను నమ్మకం. పదేళ్ల క్రితం జరిగిన టీ-ట్వంటీ ఫైనల్లో పాక్ను ఓడించిన భారత్.. ఈసారి కూడా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇటు.. బ్యాట్స్ మెన్, అటు బౌలర్లు, అంతా ఫాంలో ఉండడం కలిసొచ్చే అంశం. భారత్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ పండితులూ చెప్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







