షార్లో 23న పీఎస్ఎల్వీ ప్రయోగం
- June 18, 2017
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 23న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి38ను పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నాటికి రాకెట్లోని శిఖరభాగాన ఉపగ్రహాలను అనుసంధానం చేసి, ఉష్ణకవచాన్ని అమర్చారు. సోమవారం గ్లోబల్ చెక్ చేపట్టనున్నారు. ఈ నెల 21న ఉదయం సన్నాహకాలు చేస్తారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ ఈ నెల 22వ తేదీ ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ రాకెట్ 23వ తేదీ ఉదయం9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
నింగిలోకి 31 ఉపగ్రహాలు: పీఎస్ఎల్వీ-సి38 వాహకనౌక ఈసారి 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇందులో భారత్కు చెందిన కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, తమిళనాడులోని నూర్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. గత ఏడాది జూన్ 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీలలో రెండు కార్టోశాట్ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









