షార్లో 23న పీఎస్ఎల్వీ ప్రయోగం
- June 18, 2017
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 23న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి38ను పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నాటికి రాకెట్లోని శిఖరభాగాన ఉపగ్రహాలను అనుసంధానం చేసి, ఉష్ణకవచాన్ని అమర్చారు. సోమవారం గ్లోబల్ చెక్ చేపట్టనున్నారు. ఈ నెల 21న ఉదయం సన్నాహకాలు చేస్తారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ ఈ నెల 22వ తేదీ ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ రాకెట్ 23వ తేదీ ఉదయం9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
నింగిలోకి 31 ఉపగ్రహాలు: పీఎస్ఎల్వీ-సి38 వాహకనౌక ఈసారి 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇందులో భారత్కు చెందిన కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, తమిళనాడులోని నూర్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. గత ఏడాది జూన్ 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీలలో రెండు కార్టోశాట్ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







