లండన్ సెవెన్ సిస్టర్స్ రోడ్డులో కలకలం
- June 18, 2017
పది రోజులు కూడా పూర్తవకముందే లండన్లో మరో దుర్మార్గం. గతంలో మాదిరిగానే పాదచారులపైకి ఓ వాహనం దూసుకెళ్లి భీభత్సం సృష్టించింది. సరిగ్గా లండన్లోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులోగల ముస్లింల సంక్షేమ భవనం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సమీపంలోనే ఫిన్స్బరీ పార్క్ మసీదు ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలు ముగిసన తర్వాత ఈ మార్గం నుంచే ముస్లిలు వెళుతుంటారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వాహన డ్రైవర్ను అరెస్టు చేశారు.
ప్రస్తుతానికి ఈ సంఘటనను తీవ్రమైనదేనని చెబుతున్న పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా అతడు ఇలా చేశాడా అనే విషయాన్ని శోధిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పదిమిందిని ఈ వాహనం ఢీకొట్టింది. అంతకుముందు లండన్ బ్రిడ్జిపై కూడా ఉగ్రవాదుల వాహనం పాదచారులపైకి దూసుకెళ్లి పలువురు చనిపోయేందుకు కారణమైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఘటనపట్ల పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ అప్రమత్తమై మరోసారి అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. మొత్తం 12మంది ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









