బహ్రెయిన్ని వీడండి: ఖతార్ సైనికులకి ఆదేశం
- June 19, 2017
మనామా: ఖతార్ సైనికులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా బహ్రెయిన్ ఆదేశించింది. బహ్రెయిన్లో అమెరికన్ బేస్ ఉంది. సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది నావల్ ఫోర్సెస్ని బహ్రెయిన్లో అమెరికా నిర్వహిస్తోంది. ఈ బేస్లో జిసిసి దేశాలకు చెందిన పలువురు సైనికులు పనిచేస్తున్నారు. రీజియన్లో తీవ్రవాద కార్యకలాపాలపై ఈ బేస్ నుంచి పోరాటం జరుగుతుంటుంది. ఈ బేస్లోనే వివిధ దేశాలకు చెందిన సైనికులతోపాటు ఖతార్ సైనికులు కూడా ఉన్నారు. అయితే ఖతార్తో జిసిసికి చెందిన కొన్ని దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా, బహ్రెయిన్ తమ భూ భాగం నుంచి ఖతార్ సైనికులు వెళ్ళిపోవాలని కోరుతోంది. ఈ మేరకు బహ్రెయిన్లోని యూఎస్ బేస్ కమాండర్ ఇన్ఛార్జ్కి బహ్రెయిన్ లేఖ రాసింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







