బహ్రెయిన్ని వీడండి: ఖతార్ సైనికులకి ఆదేశం
- June 19, 2017
మనామా: ఖతార్ సైనికులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా బహ్రెయిన్ ఆదేశించింది. బహ్రెయిన్లో అమెరికన్ బేస్ ఉంది. సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది నావల్ ఫోర్సెస్ని బహ్రెయిన్లో అమెరికా నిర్వహిస్తోంది. ఈ బేస్లో జిసిసి దేశాలకు చెందిన పలువురు సైనికులు పనిచేస్తున్నారు. రీజియన్లో తీవ్రవాద కార్యకలాపాలపై ఈ బేస్ నుంచి పోరాటం జరుగుతుంటుంది. ఈ బేస్లోనే వివిధ దేశాలకు చెందిన సైనికులతోపాటు ఖతార్ సైనికులు కూడా ఉన్నారు. అయితే ఖతార్తో జిసిసికి చెందిన కొన్ని దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా, బహ్రెయిన్ తమ భూ భాగం నుంచి ఖతార్ సైనికులు వెళ్ళిపోవాలని కోరుతోంది. ఈ మేరకు బహ్రెయిన్లోని యూఎస్ బేస్ కమాండర్ ఇన్ఛార్జ్కి బహ్రెయిన్ లేఖ రాసింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









