'శంకరాభరణం' వేడుకకు తారక్
- June 19, 2017
హైదరాబాద్: 'శంకరాభరణం' చిత్రంతో బాలనటిగా అలరించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి తులసి. తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయనకు గురుదక్షిణ ఇవ్వబోతున్నారు. విశ్వనాథ్ గౌరవార్థం రేపు హైదరాబాద్లో 'శంకరాభరణం' పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ నటీనటులను ఒకే వేదికపైకి తెస్తూ 24 విభాగాల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్టు తులసి వెల్లడించారు. మాదాపూర్లోని శిల్పకళావేదికలో రేపు జరిగే ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఎన్టీఆర్ హాజరవుతారని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







