నైజీరియాలో బోకోహరమ్ ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి

- June 19, 2017 , by Maagulf
నైజీరియాలో బోకోహరమ్ ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి

ఈశాన్య నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నిరాశ్రయులైన వారి కోసం ఏర్పాటుచేసిన శిబిరం సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 16 మంది దుర్మరణం చెందారు. మైదుగురికి సమీపంలోని కోఫా గ్రామ శిబిరం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8.45 గంటలకు ఈ దాడులు జరిగినట్టు జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ తెలిపింది. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దాడికి పాల్పడ్డారని ఎన్‌ఈఎంఏ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖదీర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com