ప్రపంచ యోగ సందర్భంగా దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో ఒకే సమయంలో యోగా

- June 20, 2017 , by Maagulf
ప్రపంచ యోగ సందర్భంగా దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో ఒకే సమయంలో యోగా

దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో 74 మంత్రులతో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్‌21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని 2015వ సంవత్సరం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానితో పాటు యోగాలో పాల్గొంటున్న పలువురి ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అహ్మదాబాద్‌లో, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని సుజాన్‌పూర్‌ తిహ్రా నగరంలో, కేంద్ర మంత్రి వెంకయ్య దిల్లీలో పాల్గొనున్నారు. కాగా మిగతా కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్‌, పీయూష్‌ గోయెల్‌లు వరుసగా పట్నా, నాగ్‌పూర్‌, ఛండీగఢ్‌, కొచ్చి, భువనేశ్వర్‌, విశాఖపట్నంలలో పాల్గొనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com