గోధుమ ఉండలు
- June 21, 2017
కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, ఎండుకొబ్బరి కోరు - అరకప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా (ముక్కలు) కలిపి - అరకప్పు, గసాలు - 2 టీ స్పూన్లు, యాలకులు - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం : దళసరి కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కల్ని వేగించి తీసేయాలి. అందులోనే గోధుమపిండిని వేసి సన్నని సెగమీద బంగారురంగు వచ్చేదాక వేగించాలి. ఒక పాత్రలో బెల్లంతురుము, కొద్దిగా నీరుపోసి వేడి చెయ్యాలి. బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఒక్కపొంగు రాగానే యాలకులపొడి వేసి దించేయాలి. తర్వాత గోధుమపిండి, వేగించిన బాదం, జీడి, పిస్తా ముక్కల్ని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కాస్త ఆరిన తర్వాత పాలతో చెయ్యి తడుపుకుంటూ ఉండలు చుట్టుకుని గసాల్లో దొర్లించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









