గోధుమ ఉండలు
- June 21, 2017
కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, ఎండుకొబ్బరి కోరు - అరకప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా (ముక్కలు) కలిపి - అరకప్పు, గసాలు - 2 టీ స్పూన్లు, యాలకులు - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం : దళసరి కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కల్ని వేగించి తీసేయాలి. అందులోనే గోధుమపిండిని వేసి సన్నని సెగమీద బంగారురంగు వచ్చేదాక వేగించాలి. ఒక పాత్రలో బెల్లంతురుము, కొద్దిగా నీరుపోసి వేడి చెయ్యాలి. బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఒక్కపొంగు రాగానే యాలకులపొడి వేసి దించేయాలి. తర్వాత గోధుమపిండి, వేగించిన బాదం, జీడి, పిస్తా ముక్కల్ని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కాస్త ఆరిన తర్వాత పాలతో చెయ్యి తడుపుకుంటూ ఉండలు చుట్టుకుని గసాల్లో దొర్లించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









