గోధుమ ఉండలు
- June 21, 2017
కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, ఎండుకొబ్బరి కోరు - అరకప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా (ముక్కలు) కలిపి - అరకప్పు, గసాలు - 2 టీ స్పూన్లు, యాలకులు - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం : దళసరి కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కల్ని వేగించి తీసేయాలి. అందులోనే గోధుమపిండిని వేసి సన్నని సెగమీద బంగారురంగు వచ్చేదాక వేగించాలి. ఒక పాత్రలో బెల్లంతురుము, కొద్దిగా నీరుపోసి వేడి చెయ్యాలి. బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఒక్కపొంగు రాగానే యాలకులపొడి వేసి దించేయాలి. తర్వాత గోధుమపిండి, వేగించిన బాదం, జీడి, పిస్తా ముక్కల్ని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కాస్త ఆరిన తర్వాత పాలతో చెయ్యి తడుపుకుంటూ ఉండలు చుట్టుకుని గసాల్లో దొర్లించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!







