మాదకద్రవ్యాల కేసులో 7 గురు ఆసియా దేశస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
- June 22, 2017
రస్ అల్ ఖైమా: భారీ మొత్తంలో మాదకద్రవ్య పదార్ధాల నిల్వలను కనుగొన్న అనంతరం పోలీసులు ఏడుగురు మాదకద్రవ్య వ్యాపారులను అరెస్టు చేశారు.తమ స్వాధీనంలో ఉన్న అనుమానితులు అందరు ఆసియా జాతీయులని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తికి కొంతమంది వ్యక్తులు మాదకద్రవ్యాలలో ప్రమాదకరమైన రకాన్ని తమ వద్ద ఉందని ..కొనుగోలు చేయమని ప్రచారం చేస్తున్నారని సమాచారం పోలీసులు తెలుసుకొన్న పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. మాధకద్రవ్యాల విక్రేతలు ,వారి ఖాతాదారులందరూ అదే ఆసియ దేశాలకు చెందినవారని. పోలీసులు తెలిపారు. అనుమానితులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక జట్లుగా ఏర్పడి ఈ కేసుని చేధించినట్లు రాస్ అల్ ఖైమా పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అద్నాన్ అలీ అల్ జైబి పేర్కొన్నారు. అనుమానితులు పోలీసుల గుర్తింపును నివారించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించారని, తమ జాతీయతకు చెందిన వ్యక్తులలోనే మాదకద్రవ్య వినియోగాన్ని ప్రోత్సహించారు. విచారణ సమయంలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారని దాంతో ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు ఆయన ప్రస్తావించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









