మాదకద్రవ్యాల కేసులో 7 గురు ఆసియా దేశస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
- June 22, 2017
రస్ అల్ ఖైమా: భారీ మొత్తంలో మాదకద్రవ్య పదార్ధాల నిల్వలను కనుగొన్న అనంతరం పోలీసులు ఏడుగురు మాదకద్రవ్య వ్యాపారులను అరెస్టు చేశారు.తమ స్వాధీనంలో ఉన్న అనుమానితులు అందరు ఆసియా జాతీయులని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తికి కొంతమంది వ్యక్తులు మాదకద్రవ్యాలలో ప్రమాదకరమైన రకాన్ని తమ వద్ద ఉందని ..కొనుగోలు చేయమని ప్రచారం చేస్తున్నారని సమాచారం పోలీసులు తెలుసుకొన్న పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. మాధకద్రవ్యాల విక్రేతలు ,వారి ఖాతాదారులందరూ అదే ఆసియ దేశాలకు చెందినవారని. పోలీసులు తెలిపారు. అనుమానితులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక జట్లుగా ఏర్పడి ఈ కేసుని చేధించినట్లు రాస్ అల్ ఖైమా పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అద్నాన్ అలీ అల్ జైబి పేర్కొన్నారు. అనుమానితులు పోలీసుల గుర్తింపును నివారించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించారని, తమ జాతీయతకు చెందిన వ్యక్తులలోనే మాదకద్రవ్య వినియోగాన్ని ప్రోత్సహించారు. విచారణ సమయంలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారని దాంతో ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు ఆయన ప్రస్తావించారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







