మిథాలీరాజ్ అత్యంత అరుదైన రికార్డు బద్దలు చేసే అవకాశం
- June 22, 2017
మహిళల వన్డే ప్రపంచకప్ పోరుకు మిథాలీరాజ్ సేన సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో జూన్ 24న టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 7 మ్యాచ్లు ఆడనున్న తరుణంలో భారత సారథి, తెలుగమ్మాయి మిథాలీరాజ్ అత్యంత అరుదైన రికార్డు బద్దలు చేసే అవకాశం ఉంది.
మిథాలీరాజ్ ఇప్పటికే 100 వన్డేలకు సారథ్యం వహించిన మూడో మహిళా క్రికెటర్గా ఘనత పొందింది. ప్రస్తుతం 177 వన్డేల్లో 52.08 సగటుతో 5,781 పరుగులతో ఉంది. ఆమె మరో 212 పరుగులు చేస్తే అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు బద్దలు అవుతుంది. వన్డేల్లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ 5992 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన మహిళగా ఉంది. ప్రస్తుత ప్రపంచకప్లో మిథాలీ 212 పరుగులు చేస్తే ఎడ్వర్డ్స్ను దాటేసి కొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇక ప్రపంచకప్ను రికార్డు స్థాయిలో ఐదోసారి ఆడుతున్న మహిళగా నిలుస్తుంది. డెబ్బీ హాక్లె (న్యూజిలాండ్), క్లేర్ టేలర్, ఛార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) సైతం ఐదు సార్లు ప్రపంచకప్ ఆడారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







