జూన్ 22న దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ వర్ధంతి
- June 22, 2017
తెలుగు చిత్రసీమ వెలుగును దశదిశలా ప్రసరింపచేసిన అరుదైన వ్యక్తుల్లో దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. జూన్ 22న ఎల్.వి.ప్రసాద్ వర్ధంతి సందర్భంగా చిత్రసీమలో ఆయన సాగిన తీరును మననం చేసుకుందాం...
తెలుగు సినిమా పుట్టుక నుంచీ అనుబంధం ఉన్న నటదర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్... ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు పోషించి, ఆ పై నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా మారి మరపురాని చిత్రాలను మనకు అందించారు ఎల్వీ ప్రసాద్... మహానటులు యన్టీఆర్ను 'మనదేశం'తోనూ, శివాజీగణేశన్ను 'పరదేశి'తోనూ తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.
మాతృభాష తెలుగులోనూ, తమిళ, హిందీ భాషల్లోనూ ఎల్వీ ప్రసాద్ చిత్రాలను రూపొందించినా, అన్నీ కలిపి గుప్సెడు లేవు. అయినా ఆ చిత్రాల్లోనే తనదైన బాణీ పలికించి తెలుగువారి మదిలో చెరగని ముద్రవేశారాయన. ఎల్వీ ప్రసాద్ చిత్రాలు ఈతరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆయన స్థాపించిన సినిమా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పరచుకుని ఉన్నాయి. ఆయన నెలకొల్పిన 'ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్' దేశంలోనే అత్యున్నత నేత్ర చికిత్సాలయంగా పేరొందింది.
ఆయన వారసులు దేశంలోనే అతి పెద్ద ఐమాక్స్ థియేటర్ను భాగ్యనగరంలో నిలిపారు... అలా ప్రసాద్ పేరు తరతరాలు గుర్తుంచుకొనేలా ఆయన ఏర్పాటు చేసిన సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







