ఆల్ నూరి మసీదును ధ్వంసం చేసిన ఐసిస్ ఉగ్రవాదులు

- June 23, 2017 , by Maagulf
ఆల్ నూరి మసీదును ధ్వంసం చేసిన ఐసిస్ ఉగ్రవాదులు

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన గ్రాండ్ ఆల్ నూరి మసీదును సైన్యం ధ్వంసం చేసింది. ఐసిస్ పురుడుపోసుకున్న మోసుల్ నగరంలోని చారిత్రక మసీదుపై దాడిచేసినట్లు ఇరాక్ మిలటరీ వెల్లడించింది. 2014లో ఐసిస్ అధినేత అబుబకర్ ఆల్ బాగ్దాది ఈ మసీదునుంచే కాలిఫత్ చట్టాన్నిఅమలుచేస్తామని  ప్రకటించాడు. 45మీటర్ల ఎత్తైన ఈ మినార్ పై నల్లజెండాలను ఎగురవేసి తమ ప్రత్యేక సామ్రాజ్యంగా ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఇస్లామిక్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ మాత్రం అమెరికా వైమానిక దాడిలో మసీదు దెబ్బతిన్నదని ప్రకటించగా.. అమెరికా సైన్యం దాన్ని ఖండించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com