ఇరాక్‌లో అతిపురాతన మసీదు ధ్వంసం

- June 23, 2017 , by Maagulf
ఇరాక్‌లో అతిపురాతన మసీదు ధ్వంసం

ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద గ్రూపునకు అత్యంత బలమైన ప్రాంతం మోసుల్‌ నగరం. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం ఐఎస్‌-అమెరికా సంకీర్ణ బలగాల మధ్య సాగుతున్న పోరు భీకర రూపం దాల్చింది. సంకీర్ణ బలగాలు, ఉగ్రవాద నిరోధక దళం, ఇరాక్‌ సైన్యం, ఫెడరల్‌ పోలీస్‌...అంతా కలిసి మోసుల్‌ పాతబస్తీని అన్ని వైపుల నుంచి చుటుముట్టి దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో గల 800 సంవత్సరాల క్రితంనాటి చారిత్రక కట్టడం 'అల్‌ నూరీ' మసీదు పూర్తిగా ధ్వంసమైంది. ఐఎస్‌ ఈ పనిచేసిందని అమెరికా సంకీర్ణదళాలు, కాదు...అమెరికా సంకీర్ణదళాలే వైమానిక దాడులు జరిపి మసీదును ధ్వంసం చేశాయని ఐఎస్‌ ఆరోపించుకున్నాయి. ఏదేమైనా.. అతి పురాతన, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేశ సంపదను ఇరాక్‌ కోల్పోయింది. 800 ఏండ్ల కిత్రం 'నూర్‌ అల్‌ దిన్‌ మహ్మద్‌ జంగీ' ఆదేశాల మేరకు ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది.
ఈ మసీదులోని అత్యంత ఎత్తయిన స్తంభం (మినార్‌) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అంతేగాక.. ఇస్లామిక్‌ స్టేట్‌ నాయకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాది.. మూడేండ్ల క్రితం ఈ మసీదులోనే తనకు తాను కలీఫాగా ప్రకటించుకున్నాడు.ఐఎస్‌ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది.
'అల్‌ నూరీ మసీదు ధ్వంసమైంది.అయితే అది సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com