నేటి నుంచే మహిళల ప్రపంచకప్
- June 23, 2017
డర్బీ: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్లో నేడు టైటిల్ వేట మొదలెట్టనున్నది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మిథాలీరాజ్ సేన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో తలపడనున్నది. నేడు జరిగే మరో మ్యాచ్లో న్యూజిలాండ్, శ్రీలంక మహిళలు పోటీపడనున్నారు. కెప్టెన్ మిథాలీరాజ్ సహా హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతి మందన, మోన మెష్రమ్లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్లో బౌలింగ్ విభాగం సైతం పటిష్టంగానే కనిపిస్తోంది. బలమైన ఇంగ్లాండ్ను ఓడించాలంటే మిథాలీసేన సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానున్నది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









