నేటి నుంచే మహిళల ప్రపంచకప్‌

- June 23, 2017 , by Maagulf
నేటి నుంచే మహిళల ప్రపంచకప్‌

డర్బీ: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్‌లో నేడు టైటిల్‌ వేట మొదలెట్టనున్నది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్‌ సేన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. నేడు జరిగే మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, శ్రీలంక మహిళలు పోటీపడనున్నారు. కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సహా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వేద కృష్ణమూర్తి, స్మృతి మందన, మోన మెష్రమ్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. జులన్‌ గోస్వామి, శిఖా పాండే, పూనమ్‌ యాదవ్‌లో బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగానే కనిపిస్తోంది. బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే మిథాలీసేన సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. మ్యాచ్‌ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com