పోర్చుగల్ చేరుకున్నభారత్ ప్రధాని
- June 24, 2017
లిస్బన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పోర్చుగల్ చేరుకున్నారు. లిస్బన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. మోదీ రాక నేపథ్యంలో ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటాలతో హోర్డింగ్లు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా.. పోర్చుగల్ ప్రధాని అంటానియో కోస్టాతో మోదీ భేటీ కానున్నారు.
పోర్చుగల్ నుంచి ప్రధాని మోదీ అమెరికా బయల్దేరుతారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత శ్వేతసౌధంలో ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. అధ్యక్షుడిగా ట్రంప్ ఇస్తున్న విందులో పాల్గొంటున్న తొలి దేశాధినేత మోదీనే కావడం విశేషం. అమెరికా నుంచి మోదీ నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టేతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







