పోర్చుగల్ చేరుకున్నభారత్ ప్రధాని
- June 24, 2017
లిస్బన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పోర్చుగల్ చేరుకున్నారు. లిస్బన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. మోదీ రాక నేపథ్యంలో ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటాలతో హోర్డింగ్లు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా.. పోర్చుగల్ ప్రధాని అంటానియో కోస్టాతో మోదీ భేటీ కానున్నారు.
పోర్చుగల్ నుంచి ప్రధాని మోదీ అమెరికా బయల్దేరుతారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత శ్వేతసౌధంలో ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. అధ్యక్షుడిగా ట్రంప్ ఇస్తున్న విందులో పాల్గొంటున్న తొలి దేశాధినేత మోదీనే కావడం విశేషం. అమెరికా నుంచి మోదీ నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టేతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









