బహ్రెయిన్ లో తెలంగాణ వాసి మృతి
- June 24, 2017
బహ్రెయిన్: తెలంగాణ బిడ్డ నిజామాబాద్ జిల్లా, మాచారెడ్డి మండలం లోని, రెడ్డిపేట్ తండాకు చెందిన, సేవ్య రోత్సవం (బట్టు), వయసు 32, పాస్పోర్ట్ నెంబర్ M3852123,నస్ కంపెనీలోకి గత ఏప్రిల్ నెలలో వచ్చాడు కనీసం రెండు నెలలు కూడా కాలేదు, ఇంతలోనే విధి వెక్కిరించి దురదృష్టవశాత్తు 12 జూన్ 2017న గుండె పోటుతో మృతి చెందినడు.
వారి అకాల మరణం చాలా బాధాకరం వారికి తల్లి భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు నలుగురూ పిల్లలు ఉన్నారు అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ పేద కుటుంబం సేవ్య మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే
విషయాన్ని వారి బంధువులు కిషన్ & బాలు, ఈ విషయం ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే
స్పందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి..
కంపెనీ యజమాని / అధికారులతో మాట్లాడి వారి పార్తివ దేహాన్ని ఇండియాపంపించారు. తేదీ 22.06.17 రాత్రి గల్ఫ్ఎయిర్ ప్లయిట్ నెం. GF274 ద్వారా బహరేన్ నుండి బయలుదేరి 22.06.17 గురువారం ఉదయం 09:30గం: లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరవలసిన మృతదేహం దురదృష్టవశాత్తు అట్లాస్ ట్రావెల్ & కార్గో అధికారుల నిరక్ష్యం, అలసత్వం వల్ల, అది తేదీ 24.06.17 శనివారం ఉదయం 05:00గం:లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరింది.
రోత్సం ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఎన్నారై టీఆరెస్ సెల్ బహరెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు ప్రశాంత్,
రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, సదనంద్, గంగాధర్, సంజీవ్, దేవన్న, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









