బహ్రెయిన్ లో తెలంగాణ వాసి మృతి

- June 24, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్: తెలంగాణ బిడ్డ నిజామాబాద్ జిల్లా, మాచారెడ్డి మండలం లోని, రెడ్డిపేట్ తండాకు చెందిన, సేవ్య రోత్సవం (బట్టు), వయసు 32, పాస్పోర్ట్ నెంబర్ M3852123,నస్ కంపెనీలోకి గత ఏప్రిల్ నెలలో వచ్చాడు కనీసం రెండు నెలలు కూడా కాలేదు, ఇంతలోనే విధి వెక్కిరించి దురదృష్టవశాత్తు 12 జూన్ 2017న గుండె పోటుతో మృతి చెందినడు.
వారి అకాల మరణం చాలా బాధాకరం వారికి తల్లి భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు నలుగురూ పిల్లలు ఉన్నారు అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ పేద కుటుంబం సేవ్య మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే
విషయాన్ని వారి బంధువులు కిషన్ & బాలు, ఈ విషయం ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే
స్పందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి..
కంపెనీ యజమాని / అధికారులతో మాట్లాడి వారి పార్తివ దేహాన్ని ఇండియాపంపించారు. తేదీ 22.06.17 రాత్రి గల్ఫ్ఎయిర్ ప్లయిట్ నెం. GF274 ద్వారా బహరేన్ నుండి బయలుదేరి 22.06.17 గురువారం ఉదయం 09:30గం: లకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరవలసిన మృతదేహం దురదృష్టవశాత్తు అట్లాస్ ట్రావెల్ & కార్గో అధికారుల నిరక్ష్యం, అలసత్వం వల్ల, అది తేదీ 24.06.17 శనివారం ఉదయం 05:00గం:లకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరింది.
రోత్సం ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఎన్నారై టీఆరెస్ సెల్ బహరెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు ప్రశాంత్,
రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, సదనంద్, గంగాధర్, సంజీవ్, దేవన్న, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు.

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com