సౌదీ అరేబియాలో ముగిసిన క్షమాభిక్ష గడువు
- June 25, 2017
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. తెలంగాణకు చెందిన మూడు వేల మంది క్షమా భిక్షకు దరఖాస్తు చేసుకోగా ..మరో మూడు వేల మంది అక్కడే తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారు అక్కడ ఉండలేరు..ఇండియాకు రాలేరు. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు.రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష సౌదీ రియాల్స్ జరిమానా విధించే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోని తెలంగాణ కార్మికులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చేవారే కరువయ్యారు. సౌదీలో వేతనాలు ఎక్కువగా ఉంటాయన్న భావనతో తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉపాధి వెతుక్కుంటూ సౌదీ వెళుతున్నారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









