15 ఏళ్ళ జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం

- June 26, 2017 , by Maagulf
15 ఏళ్ళ జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం

బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు నిందితులకు పదిహేనేళ్ళ ఐలు శిక్షను సమర్థించింది. మూడేళ్ళ క్రితం ఓ ఫ్యూల్‌ స్టేషన్‌పై ఈ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫైర్‌బాంబ్స్‌ని పేల్చడం, అలాగే సిలెండర్‌ బాంబ్‌ని వినియోగించడం ద్వారా ఆ ఫ్యూయల్‌ స్టేషన్‌లో భయోత్పాతం కలిగించారు. ఈ ఘటనలో ఫ్యూయల్‌ స్టేషన్‌ సిబ్బంది, చాకచక్యంగా తప్పించుకున్నారు. విచారణలో, సిబ్బంది న్యాయస్థానం యెదుట నాటి పరిస్థితుల్ని వివరించారు. దుండగులు తమను కత్తితో బెదిరించి, ఫ్యూయల్‌ స్టేషన్‌కి నిప్పంటించినట్లు వారు చెప్పారు. సకాలంలో సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com