15 ఏళ్ళ జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం
- June 26, 2017
బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు నిందితులకు పదిహేనేళ్ళ ఐలు శిక్షను సమర్థించింది. మూడేళ్ళ క్రితం ఓ ఫ్యూల్ స్టేషన్పై ఈ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫైర్బాంబ్స్ని పేల్చడం, అలాగే సిలెండర్ బాంబ్ని వినియోగించడం ద్వారా ఆ ఫ్యూయల్ స్టేషన్లో భయోత్పాతం కలిగించారు. ఈ ఘటనలో ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది, చాకచక్యంగా తప్పించుకున్నారు. విచారణలో, సిబ్బంది న్యాయస్థానం యెదుట నాటి పరిస్థితుల్ని వివరించారు. దుండగులు తమను కత్తితో బెదిరించి, ఫ్యూయల్ స్టేషన్కి నిప్పంటించినట్లు వారు చెప్పారు. సకాలంలో సివిల్ డిఫెన్స్ టీమ్ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి









