నెదర్లాండ్స్ బయల్దేరిన నరేంద్రమోదీ
- June 26, 2017
రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి నుంచి నెదర్లాండ్స్ బయల్దేరారు. నెదర్లాండ్స్లో ఆ దేశ ప్రధాని మార్క్ రట్టేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద సంబంధిత అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా.. డచ్ కంపెనీ సీఈవోలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాను కూడా మోదీ కలవనున్నారు. ఆ తర్వాత పర్యటన ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమవుతారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈ నెల 24న మోదీ పోర్చుగల్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి అమెరికా వెళ్లిన మోదీ రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తొలిసారిగా భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా సీఈవోల సదస్సులో పాల్గొన్నారు.
భారత-అమెరికన్ విందులోనూ మోదీ ప్రసంగించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







