నెదర్లాండ్స్ బయల్దేరిన నరేంద్రమోదీ
- June 26, 2017
రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి నుంచి నెదర్లాండ్స్ బయల్దేరారు. నెదర్లాండ్స్లో ఆ దేశ ప్రధాని మార్క్ రట్టేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద సంబంధిత అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా.. డచ్ కంపెనీ సీఈవోలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాను కూడా మోదీ కలవనున్నారు. ఆ తర్వాత పర్యటన ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమవుతారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈ నెల 24న మోదీ పోర్చుగల్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి అమెరికా వెళ్లిన మోదీ రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తొలిసారిగా భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా సీఈవోల సదస్సులో పాల్గొన్నారు.
భారత-అమెరికన్ విందులోనూ మోదీ ప్రసంగించారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









