స్వదేశీ పరిజ్ఞానంతో చైనాలో వేగవంతమైన బుల్లెట్ రైలు ప్రారంభం
- June 26, 2017
స్వదేశీ పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు సోమవారం ప్రారంభమైంది. 'ఫక్సింగ్'గా పిలుస్తున్న ఈ అత్యాధునిక రైలు అత్యధికంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గంగా పేరొందిన బీజింగ్-షాంఘై మార్గంలో సోమవారం 'ఫక్సింగ్' రాకపోకలను ప్రారంభించారు. 'సీఆర్400 ఏఎఫ్' రకానికి చెందిన ఈ రైలు కేవలం 5 గంటల 45 నిమిషాల్లో బీజింగ్ దక్షిణ రైల్వే స్టేషన్ నుంచి షాంఘై చేరుకుంది. మార్గమధ్యంలో 10 స్టేషన్లలో ఆగింది. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో వేగం తగ్గించుకునేందుకు, స్వీయ ప్రదర్శనను నిరంతరం మదింపు చేసుకునేందుకు వీలుగా 'ఫక్సింగ్'లో అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. రిమోట్ డేటా ట్రాన్స్మిషన్ వ్యవస్థ, కంట్రోల్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు ఈ రైలును నియంత్రించవచ్చు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









