స్వదేశీ పరిజ్ఞానంతో చైనాలో వేగవంతమైన బుల్లెట్ రైలు ప్రారంభం
- June 26, 2017
స్వదేశీ పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు సోమవారం ప్రారంభమైంది. 'ఫక్సింగ్'గా పిలుస్తున్న ఈ అత్యాధునిక రైలు అత్యధికంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గంగా పేరొందిన బీజింగ్-షాంఘై మార్గంలో సోమవారం 'ఫక్సింగ్' రాకపోకలను ప్రారంభించారు. 'సీఆర్400 ఏఎఫ్' రకానికి చెందిన ఈ రైలు కేవలం 5 గంటల 45 నిమిషాల్లో బీజింగ్ దక్షిణ రైల్వే స్టేషన్ నుంచి షాంఘై చేరుకుంది. మార్గమధ్యంలో 10 స్టేషన్లలో ఆగింది. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో వేగం తగ్గించుకునేందుకు, స్వీయ ప్రదర్శనను నిరంతరం మదింపు చేసుకునేందుకు వీలుగా 'ఫక్సింగ్'లో అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. రిమోట్ డేటా ట్రాన్స్మిషన్ వ్యవస్థ, కంట్రోల్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు ఈ రైలును నియంత్రించవచ్చు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







