అమృత్ సరి చేప
- June 27, 2017
కావాల్సిన పదార్థాలు
చేప - 300 గ్రాములు, అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టీస్పూన్, వాము - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కారం - ముప్పావు టీస్పూన్, కసూరి మెంతి - అర టీస్పూన్, తందూరీ మసాలా - ముప్పావు టీస్పూన్, బిర్యానీ మసాలా - పావు టీస్పూన్ (అవసరమనుకుంటే), ఆమ్చూర్ - చిటికెడు, నిమ్మరసం - ఒక టీస్పూన్, శెనగపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - కొద్దిగా, నూనె - రెండు టేబుల్ స్పూన్లు (ఆవనూనె అయితే రుచి బాగా వస్తుంది)
తయారీ విధానం:
శెనగపిండిని నూనె లేకుండా పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. పిండి రంగు మారకుండా జాగ్రత్తపడాలి.
చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి నచ్చిన సైజ్లో కోయాలి.
ఈ ముక్కలకి వాము, శెనగపిండి, నూనె తప్పించి మిగతా అన్ని పదార్థాలను పట్టించాలి.
వెడల్పాటి పాన్లో నూనె వేడిచేయాలి. అందులో వాము వేసి అది చిటపటమనేవరకు ఉంచాలి. ఇందులో నానబెట్టిన చేపముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద నాలుగు నిమిషాలు ఉంచాలి. తరువాత రెండో వైపు తిప్పి మరో ఐదు నిమిషాలు వేగించాలి.
ముక్కల మీద ఒకవైపు మాత్రం శెనగపిండి చల్లాలి. వేగించేటప్పుడు పిండి మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
ముక్కల్ని రెండోవైపు తిప్పి మళ్లీ వేగించాలి. ఒకవైపు చల్లిన శెనగపిండే రెండు వైపులకు సరిపోతుంది. అవసరమనుకుంటే మంట కాస్త పెంచుకోవచ్చు. ముక్క సరిగా ఉడికేలా వేగించాలి.
తాజా వార్తలు
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!









