దాతృత్వం పాఠశాల నుంచే ప్రారంభం....అబుదాబి విద్యార్థుల వితరణ
- June 27, 2017
ఇస్లామిక్ శాఖకు చెందిన విద్యార్థులచే స్వచ్ఛంద కార్యక్రమం ఏర్పాటు చేయబడింది..సహాయం చేసే గుణం ఇంటి వద్ద నుంచే ఆరంభమవుతుంది...కానీ అబూధాబి పాఠశాల విద్యార్ధులు పాఠశాల నుంచి యోచించారు.సెయింట్ జోసెఫ్స్ స్కూలులోని విద్యార్ధులు పాఠశాల బస్సు డ్రైవర్లకు, బస్ కండక్టర్లకు, నాన్-టీచింగ్ సిబ్బందికి ,గేట్ల వద్ద నిలిచి ఉండే సిబ్బందికి సహాయం అందించారు." వారు తమ జీవితాలలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు " విద్యార్థులు పేర్కొన్నారు. 2017 ఏడాదిగాను "సహాయం చేసే సంవత్సరం" (గివింగ్ ఇయర్) గా గుర్తించారు. ఆ నేపథ్యంలో పాఠశాలలో ఈ స్వచ్ఛంద కార్యక్రమం జరిగింది. ఈ సంఘం యొక్క సభ్యులకు మా కృతజ్ఞతను తెలియచేయాలని మేము కోరుకొంటున్నాం ,ఈ సహాయం ఒక అమూల్యమైన పని అని, తరచుగా వారి సేవలు గుర్తించబడవని అన్నారు. అయితే, డ్రైవర్లు, బస్ కండక్టర్లు మరియు డోర్ మెన్ (ద్వారపాలకులు) పాఠశాల జీవితంలో విద్యార్థుల కోసం ముఖ్య పాత్ర పోషిస్తారని , విద్యార్థులు ఈ వయస్సు నుంచే ఈ ప్రాముఖ్యతని గుర్తించటం అత్యవసరం "అని సిస్టర్ కార్మెన్ తెలిపారు. విద్యార్థులు ప్రతి వ్యక్తికి టూత్ బ్రష్, టూత్ పేస్ట్ , సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్ మరియు ఇతర ఉత్పత్తులను విద్యార్థులచే అందచేబడ్డాయి.ఉపాధ్యాయ సిబ్బందిలో దాదాపు అందరు ప్రవాసీయులు కావడంతో మా విద్యార్థులు వారందరికీ అంతర్జాతీయ మొబైల్ కార్డులను సైతం అందించారని ఆమె తెలిపారు. ఇస్లామిక్ డిపార్ట్ మెంట్ విద్యార్ధులు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సహాయం ఏర్పాటు చేశారు." సమాజం నుండి మనం ఎక్కువ తీసుకోవడం కన్నా, మనమే ఎక్కువ ఇవ్వాలని మా పాఠశాలలో టీచర్లు బోధించారని " ఒక విద్యార్థి " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " కు తెలిపారు .
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









