రమదాన్ మాసంలో 26 టన్నుల అక్రమ ఆహార పదార్థాలు స్వాధీనం
- June 28, 2017
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో పెద్దయెత్తున ఫుడ్ స్టఫ్ని అక్రమంగా అమ్మకందార్లు వినియోగదారులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో రమదాన్ మాసమంతటా ప్రత్యేక తనిఖీల్ని చేపట్టింది సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ). ఈ క్రమంలో 26 టన్నుల అక్రమ ఆహార పదార్థాల్ని సీజ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్నటితో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. పాత మేకింగ్ తేదీల్ని టాంపరింగ్ చేయడం, కొత్త ప్యాక్లలో పాత ఆహార పదార్థాల్ని చొప్పించి విక్రయించడం ఇలా చాలా అభియోగాల మేరకు ఈ ఆహార పదార్థాల్ని సీజ్ చేయడం జరిగింది. 22 టన్నుల రైస్ని ఓ వేర్ హౌస్లో గుర్తించారు. పాత బియ్యాని కొత్త లేబుల్స్తో టేంపర్ చేసినట్లు గుర్తించారు. మకరోని, చిల్లీ సాస్, ఆలివ్ ఆయిల్ వంటివి వినియోగానికి వీలు కాకపోయినా, వాటిని ఆకర్షణీయమైన ప్యాక్లలోకి మార్చారు నిందితులు. లెమన్, ఆర్గానిక్ డ్రింక్ వంటివి సుమారు 9,437 లీటర్ల మేర సీజ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









