రమదాన్ మాసంలో 26 టన్నుల అక్రమ ఆహార పదార్థాలు స్వాధీనం
- June 28, 2017
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో పెద్దయెత్తున ఫుడ్ స్టఫ్ని అక్రమంగా అమ్మకందార్లు వినియోగదారులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో రమదాన్ మాసమంతటా ప్రత్యేక తనిఖీల్ని చేపట్టింది సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ). ఈ క్రమంలో 26 టన్నుల అక్రమ ఆహార పదార్థాల్ని సీజ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్నటితో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. పాత మేకింగ్ తేదీల్ని టాంపరింగ్ చేయడం, కొత్త ప్యాక్లలో పాత ఆహార పదార్థాల్ని చొప్పించి విక్రయించడం ఇలా చాలా అభియోగాల మేరకు ఈ ఆహార పదార్థాల్ని సీజ్ చేయడం జరిగింది. 22 టన్నుల రైస్ని ఓ వేర్ హౌస్లో గుర్తించారు. పాత బియ్యాని కొత్త లేబుల్స్తో టేంపర్ చేసినట్లు గుర్తించారు. మకరోని, చిల్లీ సాస్, ఆలివ్ ఆయిల్ వంటివి వినియోగానికి వీలు కాకపోయినా, వాటిని ఆకర్షణీయమైన ప్యాక్లలోకి మార్చారు నిందితులు. లెమన్, ఆర్గానిక్ డ్రింక్ వంటివి సుమారు 9,437 లీటర్ల మేర సీజ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







