మొదలైన అమర్నాథ్ యాత్ర
- June 28, 2017
జమ్ముకశ్మీర్లోని దక్షిణ పర్వత ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం 5గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మల్సింగ్ జెండా వూపి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. జమ్ము బేస్ క్యాంపు వద్ద తొలి బృందంలో 2,280మంది భక్తులు యాత్రకు బయల్దేరారు. 40 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి 2.3లక్షలకు పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈసారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గలు హెచ్చరించాయి. 100 నుంచి 150 మంది భక్తులు, 100 మంది పోలీసులను అంతమొందించాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ రాసిన లేఖ సోషల్మీడియాలో ప్రత్యక్షమైంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. యాత్రకు దాదాపు 35వేల మంది పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర ఆగస్టు 7న ముగియనుంది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







