పుల్లెల గోపీచంద్ బయోపిక్
- June 28, 2017
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ జీవితాధారంగా బయెపిక్ రాబోతోంది. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'నాపై సినిమా రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. విక్రమ్ తీయబోయే చిత్రంతో బాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందుతుందని ఆశిస్తున్నాను' అని గోపీచంద్ మీడియాతో అన్నారు. గోపీచంద్ 2001లోఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గెలిచారు. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, దీపిక పదుకొణె తండ్రి ప్రకాశ్ పదుకొణె తర్వాత ఆ రికార్డు కైవసం చేసుకుంది గోపీచందే. ఆ తర్వాతగోపీచంద్ హైదరాబాద్లో అకాడమీ ప్రారంభించారు. గోపీచంద్ శిక్షణలో ఒలింపిక్ రజత పతాకం గెలుచుకున్న పీవీ సింధుపై కూడా బయెపిక్ వస్తుండడం గమనార్హం. నటుడు, నిర్మాత సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్టు సమాచారం
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







