జూలై 1 నుంచి పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి
- June 28, 2017
పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు నంబర్ లేదా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినపుడు కేటాయించిన గుర్తింపు నంబర్ అయినా పేర్కొనాలి. జూలై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ చేసేందుకూ పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని ఐటి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. పాన్ కార్డుల జారీ, ఐటిఆర్ల ఫైలింగ్కు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ఐటి చట్టంలో చేసిన మార్పులను సుప్రీం కోర్టు ఇటీవల సమర్ధించింది. దీంతో జూలై 1 నుంచి పాన్ నంబర్ కోసం చేసే దరఖాస్తుల్లోనూ ఆధార్ నంబర్ పేర్కొనాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







