అగ్ని ప్రమాదం: నిద్రలోనే కార్మికుడి దుర్మరణం
- June 29, 2017
37 ఏళ్ళ బంగ్లాదేశీ కార్మికుడు అగ్ని ప్రమాదం కారణంగా నిద్రలోనే అగ్ని కీలలకు ఆహుతైపోయిన దుర్ఘటన షార్జాలో చోటు చేసుకుంది. ఓ కార్ వాష్ సెంటర్కి అటాచ్ చేసి ఉన్న ఉడెన్ రూమ్లో కార్మికుడు నిద్రపోయాడు. దురదృష్టవశాత్తూ సంభవించిన అగ్ని ప్రమాదంలో అతను ఆహుతైపోయాడు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నకాబి మాట్లాడుతూ, సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









