సౌదీ అరేబియాలో క్షమాభిక్ష మరో 30 రోజుల పొడిగింపు
- June 29, 2017
రియాద్: పెనాల్టీ లేకుండా ఉల్లంఘనులైన వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు ఇప్పటికే ప్రకటించిన క్షమాభిక్ష ఇటీవల ముగియగా, దాన్ని మరో 30 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వచ్చింది. రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి ఈ అమ్నెస్టీని ప్రకటించారు. 'ఉల్లంఘనలు లేని దేశం' అనే నినాదంతో ఈ క్షమాభిక్షను ప్రసాదించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 29 నుంచి క్షమాభిక్ష పీరియడ్ ప్రారంభమైంది. 90 రోజులకుగాను తొలుత ఈ క్షమాభిక్ష ప్రకటించారు. దాన్ని మరో 30 రోజులకు తాజాగా పొడిగించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ సూచనల మేరకు 30 రోజుల కొత్త క్షమాభిక్షను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







