సౌదీ అరేబియాలో క్షమాభిక్ష మరో 30 రోజుల పొడిగింపు
- June 29, 2017
రియాద్: పెనాల్టీ లేకుండా ఉల్లంఘనులైన వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు ఇప్పటికే ప్రకటించిన క్షమాభిక్ష ఇటీవల ముగియగా, దాన్ని మరో 30 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వచ్చింది. రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి ఈ అమ్నెస్టీని ప్రకటించారు. 'ఉల్లంఘనలు లేని దేశం' అనే నినాదంతో ఈ క్షమాభిక్షను ప్రసాదించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 29 నుంచి క్షమాభిక్ష పీరియడ్ ప్రారంభమైంది. 90 రోజులకుగాను తొలుత ఈ క్షమాభిక్ష ప్రకటించారు. దాన్ని మరో 30 రోజులకు తాజాగా పొడిగించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ సూచనల మేరకు 30 రోజుల కొత్త క్షమాభిక్షను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









